వివాహేతర సంబంధాలు మరియు వాటి మీద ఆధార పడ్డ కథలు
ఎక్కువ రసానుభూతిని కలిగించడానికి ముఖ్య కారణం, అవి ప్రకృతి సహజం. వివాహం
అనేది ప్రకృతి విరుద్ధం.
ప్రాకృతిక పనులు చేసినప్పుడు
కలిగే సుఖం కృత్రిమమైనవి ఎన్ని చేసిన కలగదు. చాలా సాధారనమైన ఉదాహరణ
మూత్రాన్ని కృత్రిమముగా చాలా సేపు ఆపుకున్నప్పుడు కలిగే బాధ వర్ణనాతీతం.
అలాగే ఆ తరవత మూత్రన్ని విసర్జించినప్పుడు కలిగే సుఖము అమోఘం.
లక్షల సంవత్సరాలుగా ప్రకృతి మిగితా జంతువుల లాగే మనుషులని
మెరుగు పరుస్తు వచ్చింది (darwin';s natural selection సిద్ధాంతం).
ఆడవారికి నచ్చిన మగాడితోనే సంతానం ఉండటం వలన ప్రతీ తరం మరింత మెరుగు పడుతూ
వచ్చింది. వివాహం అనే కృత్రిమ వ్యవస్థ వచ్చాకే ఎందుకు పనికి రాని వాడికి
కూడా సంతానం ఆ సంతానానికి సంతనం అలా పెరిగి మనిషి జాతి లో నిస్సత్తువ,
జన్యుపరమైన రోగాలు ప్రబలిపోయాయి.
మహాభారతం లో అంతర్లీనంగా ఏ విషయాన్నే చెప్పారు. భీష్ముడి
తమ్ముళ్ళు, వాళ్ళ కొడుకులు ఎందుకు పనికిరాని వారు. అప్పుడు వివాహేతర
సంబంధాల వలనే పిల్లలని పుట్టించక తప్పలేదు. పాండు రాజు అందుకు సరైన
ఉదాహరణ.
9 నెలలు మోసి కని పెంచాల్సిన బృహత్తరమైన బాధ్యత ప్రకృతి ఒక స్త్రీ
మీద పెట్టినప్పుడు ఆ బిడ్డకి సాధ్యమైనంతవరకు మంచి లక్షణాలు ఉండాలని ఆమే
కోరుకోవడం లో తప్పు లేదు. ఆమెకి అందుబాటులో ఉన్న మగవారిలో అందరికన్నా
మెరుగైన జన్యువులు ఉన్న మగాడితో గర్భం దాల్చడం లో తప్పులేదు. ఇది ప్రకృతి
సహజం, అది రంకు ఐనా సరే.
No comments:
Post a Comment